పేదల ఆహార భద్రతకే రూపాయికి కిలో బియ్య్చ్ఞం

రచ్చబండ కార్యక్రమాల్లో 24 లక్షల నూతన కార్డులు ఇవ్వడానికి నిర్ణయించినట్లు తెలిపారు. ఇవి ఇతర జిల్లాలవని, నగరానికి సంబంధించి లక్షా 68 వేల దరఖాస్తులు వచ్చాయని, ఈనెల 15వ తేదీ వరకు వాటి సర్వే పూర్తిచేసి నూతన కార్డులు ఇవ్వ డం జరుగుతుందన్నారు. ఈ పథకం వల్ల రాష్ట్రంలో రెండు కోట్ల 20 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరు తుందని ఆయన తెలిపారు. ఈ పథకంతో పాటు ఉద్యోగ జాతర పేరుతో లక్షా 16వేల ఉద్యోగాలను డిసెంబరు లోపు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే రాజీవ్ యువకిరణాలు ద్వారా 15 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు. మహిళా సంఘాలకు దేశం మొత్తంలో రూ. 22వేల కోట్లు ఇస్తే, ఇందులో రాష్ట్రంనుంచి 10వేలకోట్లు ఇవ్వడం జరిగిందన్నారు.
పిసిసి అధ్యక్షులు, రవాణా మంత్రి బొత్స సత్య నారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఒకరు తాము ప్రభుత్వంలో ఉండగా రైతులను పట్టించుకోకుండా ఇప్పుడు రైతు యాత్రలు చేస్తు న్నారని, మరొకరు ప్రభుత్వంలో ఉండగా పేదలను దోపిడీ చేసి ఇప్పుడు పేదల సంక్షేమం గురించి మాట్లాడుతున్నారని పరోక్షంగా జగన్, చంద్రబాబు లను విమర్శించారు.పౌరసరఫరాల మంత్రి శ్రీధర్బాబు మాట్లా డుతూ సోనియాగాంధీ ఆదేశాల మేరకు ముఖ్య మంత్రి రూపాయికి కిలో బియ్యం ప్రవేశపెట్టారన్నారు.మంత్రి దానం నాగేందర్ మాట్లా డుతూ పేదల సంక్షేమంపై చిత్తశుద్ది ఉన్న ప్రభుత్వం కాబట్టే ఎంత ఆర్దిక భారం మీదపడుతున్నా కూడా భరించడానికి సిద్దపడి రూపాయికి కిలోబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టిందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మంత్రులు రఘువీరారెడ్డి, గీతారెడ్డి, కాసు కృష్ణారెడ్డి, అహ్మదుల్లా, పితాని సత్యనారా యణ, ముఖేష్గౌడ్, ఎంపి అంజన్కుమార్ యాదవ్, మేయర్ కార్తీకరెడ్డిలతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
